ముగ్గురు దొంగల అరెస్టు

ABN , First Publish Date - 2021-05-17T05:01:12+05:30 IST

స్థానిక మల్లకతువ సమీపంలో ముగ్గురు దొంగలను పోలీ సులు అరెస్టు చేసి, వారి వద్ద నుంచి మూడు ట్రాక్టరు ట్రాలీలు, ఒక నీళ్లట్యాంకరును స్వాధీనం చేసుకున్నారు.

ముగ్గురు దొంగల అరెస్టు
పట్టుబడిన నిందితులు, స్వాధీనం చేసుకున్న ట్రాక్టరు ట్రాలీలను చూపుతున్న పోలీసులు

మూడు ట్రాక్టరు ట్రాలీలు, నీళ్ల ట్యాంకరు స్వాధీనం


పోరుమామిళ్ల, మే 16: స్థానిక మల్లకతువ సమీపంలో ముగ్గురు దొంగలను పోలీ సులు అరెస్టు చేసి, వారి వద్ద నుంచి మూడు ట్రాక్టరు ట్రాలీలు, ఒక నీళ్లట్యాంకరును స్వాధీనం చేసుకున్నారు. సీఐ మోహన్‌రెడ్డి, ఎస్‌ఐ మోహన్‌ తెలిపిన మేరకు వివరాలిలా... మైదుకూరు డీఎస్పీకి వచ్చిన సమాచారం మేరకు ఆదివారం మల్లకతవ సమీపంలో వాహనాలు తనిఖీ చేపట్టామన్నారు. ఈ తనిఖీలో కొమరోలు మం డలం మాదిపొట్టిగారిపల్లెకు చెందిన నారాయణ, అదే గ్రామానికి చెందిన దాసరి ప్రసాద్‌, మాదిగునిరెడ్డిపల్లెకు చెందిన దూదేకుల కరన్నగారి నరసింహులును అదుపులోకి తీసుకుని విచారణ చేశామన్నారు. ఈ మేరకు పోరుమామిళ్ల కమ్మవారిపల్లె వద్ద దొంగలించిన రూ.60వేలు విలువ చేసే ట్రాక్టరు ట్రాలీని, గిద్దలూరు మండలం తాళ్లపల్లె వద్ద చోరీకి  గురైన రూ.లక్షా 50వేలు విలువైన ట్రాక్టరు ట్రాలీని, ప్రకాశం జిల్లా మోతు సమీపంలో చోరీకి గురైన లక్షా 8500 విలువ చేసే నీళ్లట్యాంకరును, గిద్దలూరు మండలం తంబళ్లపల్లె వద్ద చోరీకి గురైన లక్ష రూపాయల విలువ చేసే ట్రాలీని, చోరీలకు ఉపయోగించిన బొలెరో ట్రక్కును స్వాధీనం చేసుకుని, నింది తులను అరెస్టు చేశామన్నారు. ఈ వాహనాలు కొనుగోలు చేసిన వారు పరారీలో ఉన్నారని, వారిపై కూడా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

Updated Date - 2021-05-17T05:01:12+05:30 IST