కనీవినీ ఎరుగని వింత కథ.. ఒకే కుర్రాడిని ప్రేమించిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. వీళ్లంతా కలిసి ఇచ్చిన ట్విస్ట్‌తో ఊరంతా హాట్‌టాపిక్

ABN , First Publish Date - 2021-09-29T06:24:34+05:30 IST

ముగ్గురు అక్కాచెల్లెళ్లు. అందులో పెద్దమ్మాయికి పెళ్లయింది. కొద్ది నెలలకే భర్తతో గొడవలు పడి పుట్టింటికి వచ్చేసింది. ఆ తర్వాత విడాకులు కూడా తీసుకుంది. కొన్నాళ్ల తర్వాత ఉన్నట్టుండి ఆ ఇంట్లో ఉన్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు అదృశ్యమయిపోయారు.

కనీవినీ ఎరుగని వింత కథ.. ఒకే కుర్రాడిని ప్రేమించిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. వీళ్లంతా కలిసి ఇచ్చిన ట్విస్ట్‌తో ఊరంతా హాట్‌టాపిక్

ముగ్గురు అక్కాచెల్లెళ్లు. అందులో పెద్దమ్మాయికి పెళ్లయింది. కొద్ది నెలలకే భర్తతో గొడవలు పడి పుట్టింటికి వచ్చేసింది. ఆ తర్వాత విడాకులు కూడా తీసుకుంది. కొన్నాళ్ల తర్వాత ఉన్నట్టుండి ఆ ఇంట్లో ఉన్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు అదృశ్యమయిపోయారు. కూతుళ్లు ముగ్గురూ రాత్రికి రాత్రే కనిపించకుండా పోవడంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర అయోమయానికి గురయ్యారు. బంధువుల ఇళ్లల్లో విచారించారు. ఊళ్లోనూ గాలించారు. ఎలాంటి అనుమానాస్పద సంఘటనలు చుట్టుపక్కల జరగలేదు. దీంతో ఏం చేయాలో ఆ తల్లిదండ్రులకు పాలుపోలేదు. ముగ్గురు అమ్మాయిల అదృశ్యం గురించే ఆ ఊళ్లో హాట్ టాపిక్ అయింది. ఆ నోటా ఈ నోటా పడి అసలు విషయం ఆ తల్లిదండ్రుల చెవిన పడింది. చివరకు ఆసలేం జరిగిందన్నది ఊరంతా పాకిపోయింది. ఓ యువకుడితో ముగ్గురమ్మాయిల ప్రేమ వ్యవహారం గురించి సోషల్ మీడియాలో వైరల్ అయి కూర్చుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 


ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ జిల్లాలోని అజీమ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతి పక్క ఊరికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. కొన్నాళ్ల పాటు వారి మధ్య ప్రేమ వ్యవహారం సాగింది. అయితే అనుకోని పరిస్థితుల్లో ఆ యువతి మరో వ్యక్తిని పెళ్లాడాల్సి వచ్చింది. ఆ యువతికి 18 ఏళ్ల వయసున్న చెల్లి ఉంది. వారిద్దరి ప్రేమ వ్యవహారం గురించి చెల్లికి తెలుసు కూడా. అక్కకు పెళ్లయిన తర్వాత ఆ చెల్లి.. తన అక్క ప్రియుడితోనే ప్రేమించింది. అతడు కూడా ఆమెతో ప్రేమాయణం సాగించాడు. పెళ్లయిన తర్వాత కూడా ఆ యువతి తన ప్రియుడిని మర్చిపోలేకపోయింది. దీంతో కొద్ది నెలలకే భర్తతో గొడవలు పడి విడాకులు ఇచ్చి పుట్టింటికి వచ్చేసింది. 


పుట్టింటికి వచ్చిన కొన్నాళ్లకే తన ప్రియుడితో చెల్లి ప్రేమాయణం గురించి గ్రహించింది. అయినప్పటికీ ఆ యువతి ఏమీ గొడవలు పడలేదు. ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆ కుర్రాడితో ప్రేమాయణం సాగించారు. మరి వీళ్ల వ్యవహారం తెలిసి తప్పులేదనుకుందో.. తప్పుదోవ పట్టించారో ఏమో కానీ ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లకు సొంత చెల్లి అయిన మైనర్ బాలిక కూడా ఆ ప్రేమ రొంపిలోకి దిగింది. ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకే కుర్రాడితో ప్రేమాయణం సాగించారు. ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం సాగించిన ఘటనలు గతంలో చాలానే జరిగాయి. వాటి గురించిన వార్తలు కోకొల్లలుగా వచ్చాయి. కానీ ఇక్కడ వ్యవహారం మాత్రం పూర్తిగా రివర్స్‌గా ఉంది. ముగ్గురు అక్కాచెల్లెళ్లు కలిసి ఒకే కుర్రాడిని ప్రేమించారు. 


మరి సమాజం ఒప్పుకోదనో, లేక ఇంట్లో తల్లిదండ్రులు తిడతారనో ఏమో కానీ ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లు తన ప్రియుడితో కలిసి ఎనిమిది రోజుల క్రితం రాత్రికి రాత్రే ఊరొదిలి పారిపోయారు. తెల్లారిన తర్వాత ఇంట్లో ముగ్గురు కూతుళ్లు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అయోమయం చెందారు. ఊరంతా వెతికినా, బంధువుల ఇళ్లల్లో ఆరా తీసినా వారి ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేద్దామనుకునేలోపే కూతుళ్ల గురించి ఓ కొత్త నిజం తెలిసింది. ముగ్గురూ కలిసి ఒకే కుర్రాడిని ప్రేమించారనీ, అతడితో కలిసి పారిపోయారన్న వార్త ఆ తల్లిదండ్రుల చెవిన పడింది. దీంతో పరువు పోతుందన్న ఉద్దేశంతో ఆ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లాలన్న ఆలోచనను విరమించుకున్నారు. ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే కొందరు నెటిజన్లు ఈ ఘటనకు సంబంధించిన వార్తను ట్వీట్ చేస్తూ.. రాంపూర్ పోలీస్ స్టేషన్ అధికారిక ట్విటర్ ఖాతాను ట్యాగ్ చేశారు. దీంతో రాంపూర్ పోలీసులు వెంటనే స్పందించారు. ‘మీరు చేసిన ట్వీట్ ఆధారంగా అజీమ్‌నగర్ స్టేషన్ ఇంచార్జ్ ఈ కేసును విచారించి తగిన చర్యలు తీసుకుంటారు..’ అంటూ రాంపూర్ పోలీస్ స్టేషన్ ట్విటర్ ఖాతా నుంచి రెస్పాన్స్ వచ్చింది. మరి పోలీసులు ఆ అక్కాచెల్లెళ్లను వారి ముద్దుల ప్రియుడిని పట్టుకుంటారో లేదో.. పట్టుకుంటే అసలేం తేల్చుతారో..? అన్నది ఆసక్తికరంగా మారింది. 



Updated Date - 2021-09-29T06:24:34+05:30 IST