త్రీప్లస్‌ వన్‌ ఆఫర్‌

ABN , First Publish Date - 2021-10-19T05:08:51+05:30 IST

త్రీప్లస్‌ వన్‌ ఆఫర్‌

త్రీప్లస్‌ వన్‌ ఆఫర్‌

ఓ నాయకుడి ఇంట్లో నాలుగు మీటర్లు

మూడింటికి బిల్‌.. మరో దానికి నిల్‌

వెలుగులోకి వస్తున్న విద్యుత్‌శాఖ అధికారుల లీలలు 

ఖమ్మం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): రెండు వస్తు వులుకొంటే మూడోది ఫ్రీ.. అంటూ మార్కెట్‌లో వాణిజ్య సంస్థలు, వ్యాపారులు ఆఫర్లు ప్రకటించే విషయం తెలి సిందే. అదే తరహాలో విద్యుత్‌ శాఖ అధికారులు కూడా ఓ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చేశారు. ఓ పేరున్న వ్యక్తికి మూడు విద్యుత్‌ మీటర్లకు డీడీలు చెల్లిస్తే ఓ విద్యుత్‌ మీటరును ఫ్రీగా ఇచ్చేశారంటే విద్యుత్‌ మీటర్ల మాయ ఏ తరహా లో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఖమ్మం నగరంలోని పాండురంగాపురంలోఇటీవల రెండు మీటర్ల వ్యవహారం బయటకు రాగా.. ఇంకా మరిన్ని మాయ వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అదే ప్రాంతంలోని జయనగర్‌ కాలనీకి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడికి విద్యుత్‌శాఖ అధికారులు ఇచ్చిన బంపర్‌ ఆఫర్‌ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సదరు నేత నివాసంలో విద్యుత్‌శాఖ అధికారులు మొత్తం నాలుగు మీటర్లు ఏర్పాటు చేయగా.. అందులో ఒక మీటరుకు మాత్రం అసలు సర్వీసు నెంబర్‌ను కేటాయించకపోవడం గమనార్హం. దీంతో 2018నుంచి సదరు మీటరుకు బిల్లు రావడంలేదంటే సంబంధిత అధికారుల పనితీరు ఎలాఉందో అర్థం చేసుకోవచ్చు.కాగా విద్యుత్‌ మీటర్ల మాయపై ‘ఆంధ్రజ్యోతి’ దిన పత్రికలో వరుస కథనాలు ప్రచురితమవుతుండటంతో పలువురు ఫోన్‌ చేసి మీటర్ల మాయల తీరును దృష్టికి తెస్తున్నారు.ఈక్రమంతో రోజుకో ఘటన వెలుగులోకి వస్తుం ది. అయితే 2018 నుంచి ఆ ప్రాంతంలో పలువురు అధికారులు మారగా.. ప్రస్తుతం ఉన్న అధికారులు కూడా ఏడాదిన్నర క్రితం బాధ్యతలు స్వీకరించిన వారే. కానీ నేటి వరకు ఆ శాఖ అధికారులకు ఉచిత మీటరు విషయం తెలియకపోవడం శోచనీ యం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2021-10-19T05:08:51+05:30 IST