Americaలో కాల్పుల కలకలం.. వేరు వేరు ఘటనల్లో ముగ్గరు మృతి

ABN , First Publish Date - 2022-02-02T21:20:01+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. వేరు వేరు చోట్ల జరిగిన ఘటనల్లో మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. వర్జీనియాలోని బ్రిడ్జ్‌వాటర్ కా

Americaలో కాల్పుల కలకలం.. వేరు వేరు ఘటనల్లో ముగ్గరు మృతి

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. వేరు వేరు చోట్ల జరిగిన ఘటనల్లో మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. వర్జీనియాలోని బ్రిడ్జ్‌వాటర్ కాలేజీ ఆవరణలో మంగళవారం ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు క్యాంపస్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాల్పులకు తెగబడిన అనంతరం ఆగంతకుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే 27ఏళ్ల అలెగ్జాండర్ అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చనే అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా అతడి నుంచి ఓ హ్యాంగ్ గన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. దుంగడుగు జరిపిన కాల్పుల్లో క్యాంపస్ సేఫ్టీ ఆఫీసర్ జే.జే జెఫ్ఫర్సన్, క్యాంపస్ పోలీస్ ఆఫీసర్ జాన్ పీటర్ ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించారు. 


ఇదిలా ఉంటే.. మిన్నసోటలో కూడా ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. రిచ్‌ఫీల్డ్ సిటీలోని ఎడ్యకేషన్ సెంటర్ వద్ద ఓ ఆగంతకుడు కాల్పులు జరపడంతో ఓ విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి కోసం గాలిస్తున్నట్టు రిచ్‌ఫీల్డ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ చీఫ్ జాయ్ హెన్‌త్రోన్ వెల్లడించారు. 




Updated Date - 2022-02-02T21:20:01+05:30 IST