ముగ్గురికి గాయాలు
ABN , First Publish Date - 2021-01-16T05:37:46+05:30 IST
మండలంలోని ఇస్వీ గ్రా మంలో సంక్రాంతి పండుగ రోజు నాగలక్ష్మి ఇంట్లో విషాదం నెలకొంది.
ఆదోని రూరల్, జనవరి 15: మండలంలోని ఇస్వీ గ్రా మంలో సంక్రాంతి పండుగ రోజు నాగలక్ష్మి ఇంట్లో విషాదం నెలకొంది. కొత్త గ్యాస్ సిలిండర్ను అమర్చడంలో గ్యాస్ లీకేజీ కావడం పక్కనే వెలుగుతున్న కట్టెల పొయ్యి ద్వారా మంటలు వ్యాపించి నాగలక్ష్మి, ఆమె కూతురు కవిత గాయపడ్డారు. గ్యాస్ సిలిండర్ అమర్చడానికి వచ్చిన పక్కింటి విద్యార్థి దస్తగిరి తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే మంటలను అదుపు చేసి క్షతగాత్రులను ఆదోని ఏరి యా ఆసుపత్రికి తరలించారు. ఇస్వీ పోలీసులు కేసు నమోదు చేశారు.