అమెరికాలో ఒకేరోజు మూడు చోట్ల కాల్పులు.. నలుగురు మృతి!
ABN , First Publish Date - 2021-05-09T16:02:05+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాలో శనివారం ఒకే రోజు మూడు చోట్ల కాల్పులు చోటు చేసుకున్నాయి.
న్యూయార్క్, మేరీల్యాండ్, సౌత్ ఫ్లోరిడా: అగ్రరాజ్యం అమెరికాలో శనివారం ఒకే రోజు మూడు చోట్ల కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ మూడు ఘటనల్లో నలుగురు చనిపోగా, మరో ఏడుగురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. మొదటి ఘటన అమెరికాలోని మేరీల్యాండ్లో జరిగింది. గుర్తుతెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. మరొకరు గాయపడ్డారు. అయితే, కాల్పులు జరిపిన అనుమానితుడిని మేరీల్యాండ్ పోలీసులు అక్కడిక్కడే కాల్చి చంపేసినట్లు సమాచారం. రెండో ఘటన అమెరికాలోని సౌత్ ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ మాల్లో రెండు గ్రూపుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ కాస్తా కాల్పులకు దారి తీసింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. ఇక మూడో ఘటన న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్లో జరిగింది. టైమ్స్ స్క్వేర్ వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ కాల్పుల్లో నాలుగేళ్ల చిన్నారితో పాటు ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, న్యూయార్క్లో వరుస కాల్పుల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని ఎన్వైపీడీ కమిషనర్ డెర్మోట్ సియా పేర్కొన్నారు.