మహారాష్ట్రలో కరోనాతో ముగ్గురు పోలీసుల మృతి

ABN , First Publish Date - 2020-08-13T17:46:30+05:30 IST

మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో కరోనాతో మరో ముగ్గురు పోలీసులు మరణించారు.....

మహారాష్ట్రలో కరోనాతో ముగ్గురు పోలీసుల మృతి

ముంబై (మహారాష్ట్ర): మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో కరోనాతో మరో ముగ్గురు పోలీసులు మరణించారు. మహారాష్ట్ర పోలీసు శాఖలో గత 24గంటల్లో 381 మందికి కరోనా సోకగా వారిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. దీంతో మహారాష్ట్ర పోలీసుశాఖలో మృతుల సంఖ్య 124కు పెరిగింది. మొత్తం 11,773 మందికి కరోనా సోకగా వారిలో 9,416 మంది పోలీసులు కోలుకున్నారు. దేశంలోనే మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్కరోజే 66,999 కరోనా కేసులు వెలుగుచూశాయి.

Updated Date - 2020-08-13T17:46:30+05:30 IST