భారత్‌కు మరో మూడు కాంస్యాలు

ABN , First Publish Date - 2020-02-20T10:12:28+05:30 IST

ఆసియన్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షి్‌ప్స గ్రీకో-రోమన్‌ స్టయిల్లో భారత్‌కు మరో మూడు పతకాలు లభించాయి. అషు, ఆదిత్య కుండూ, హర్దీప్‌ సింగ్‌ కాంస్యాలు

భారత్‌కు మరో మూడు కాంస్యాలు

ఆసియన్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షి్‌ప్స

సాయంత్రం 6 గం.నుంచి స్టార్‌స్పోర్ట్స్‌ ఫస్ట్‌లో...


న్యూఢిల్లీ: ఆసియన్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షి్‌ప్స గ్రీకో-రోమన్‌ స్టయిల్లో భారత్‌కు మరో మూడు పతకాలు లభించాయి. అషు, ఆదిత్య కుండూ, హర్దీప్‌ సింగ్‌ కాంస్యాలు నెగ్గారు. బుధవారం జరిగిన 67 కిలోల కాంస్య పతక బౌట్‌లో అషు 8-1తో మహమ్మద్‌ అల్‌ హసన్‌ (సిరియా)ను ఓడించాడు. 72 కిలోల మ్యాచ్‌లో ఆదిత్య 8-0తో నవో కుసాకా (జపాన్‌)పై, 97 కిలోల్లో హర్దీప్‌ 3-1తో బెక్‌సుల్తాన్‌ మఖ్మముదోవ్‌ (కజకిస్థాన్‌)పై నెగ్గారు. కాగా, 60 కిలోల కాంస్య పోరులో జ్ఞానేందర్‌ 0-6తో ఇస్లోమ్‌జోన్‌ బకరమోవ్‌ (ఉజ్బెకిస్థాన్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు. గ్రీకో-రోమన్‌లో సునీల్‌ కుమార్‌ స్వర్ణం, అర్జున్‌ కాంస్యంతో కలిపి భారత్‌ ఐదు పతకాలు సాధించింది. 

Updated Date - 2020-02-20T10:12:28+05:30 IST