ఉడుమును కూడా వదల్లేదు.. అత్యాచారం చేస్తూ మొబైల్లో రికార్డ్ చేసి..
ABN , First Publish Date - 2022-04-18T08:13:55+05:30 IST
కామంతో కళ్లు మూసుకుపోయిన నలుగురు వ్యక్తులు ఉడుమును కూడా వదల్లేదు. అక్రమంగా రిజర్వ్ ఫారెస్ట్లోకి ప్రవేశించి దానిపై కూడా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఘటనను మొబైల్లో రికార్డు కూడా చేశారు...
కామంతో కళ్లు మూసుకుపోయిన నలుగురు వ్యక్తులు ఉడుమును కూడా వదల్లేదు. అక్రమంగా రిజర్వ్ ఫారెస్ట్లోకి ప్రవేశించి దానిపై కూడా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఘటనను మొబైల్లో రికార్డు కూడా చేశారు. చివరకు పోలీసులకు దొరికిపోయారు. మహారాష్ట్రలోని సహ్యాద్రి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఈ ఘటన జరిగింది.
సహ్యాద్రి టైగర్ రిజర్వ్ పరిధిలోని చందోలి నేషనల్ పార్క్లోకి అక్రమంగా ప్రవేశించిన నిందితులు ఉడుముపై అత్యాచారానికి పాల్పడ్డారు. సీసీటీవీ ఫుటేజ్ చూసిన అటవీ అధికారులు ఆ నిందితులు నలుగురినీ అరెస్ట్ చేశారు. నిందితులపై మార్చి 31న ఎఫ్ఐఆర్ నమోదు అయింది. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులను సందీప్ తుకారాం, మంగేష్, అక్షయ్, రమేష్లుగా గుర్తించారు.
ఈ నలుగురూ కొంకణ్ నుంచి చందోలి గ్రామానికివేట కోసం వచ్చినట్లు అధికారులు తెలిపారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం కేసులు నమోదు చేశారు. నేరం రుజువైతే ఒక్కొక్కరికీ ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.