భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎదురుకాల్పులు.. ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2020-09-24T02:21:33+05:30 IST

చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో పోలీసులకు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎదురుకాల్పులు.. ముగ్గురి మృతి

భద్రాద్రి కొత్తగూడెం: చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో పోలీసులకు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. సంఘటనా స్థలంలో ఒక ఆయుధం, గుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.


తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ సునీల్‌ దత్‌ తెలిపారు. మృతులు శబరి ఏరియా దళ సభ్యులుగా గుర్తించినట్లు వెల్లడించారు.

Updated Date - 2020-09-24T02:21:33+05:30 IST