క్వారీ ప్రమాదంలో ముగ్గురు మృతి

ABN , First Publish Date - 2021-12-18T22:00:45+05:30 IST

జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఖాజీపేట మండలంలోని

క్వారీ ప్రమాదంలో ముగ్గురు మృతి

హన్మకొండ: జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఖాజీపేట మండలంలోని తరాలపల్లిలో గల ఓ గ్రానైట్ క్వారీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. గ్రానైట్‌తో ఉన్న టిప్పర్‌ ప్రమాదవశాత్తు పల్టీలు కొట్టి అక్కడే ఉన్న ముగ్గురిపై పడింది. వారు అక్కడికక్కడే మృతి చెందారు. సరియైన భద్రతా చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రానైట్‌ను అన్‌లోడ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.  


Updated Date - 2021-12-18T22:00:45+05:30 IST