మద్రాస్ హైకోర్టులో ముగ్గురు జడ్జీలకు కరోనా

ABN , First Publish Date - 2020-06-06T16:27:58+05:30 IST

మద్రాస్ హైకోర్టులో ముగ్గురు జడ్జీలకు కరోనా వైరస్ సోకడంతో కేవలం అత్యవసర కేసులనే వీడియో కాన్ఫరెన్స్ ద్వార విచారించాలని నిర్ణయించారు....

మద్రాస్ హైకోర్టులో ముగ్గురు జడ్జీలకు కరోనా

చెన్నై(తమిళనాడు): మద్రాస్ హైకోర్టులో ముగ్గురు జడ్జీలకు కరోనా వైరస్ సోకడంతో కేవలం అత్యవసర కేసులనే వీడియో కాన్ఫరెన్స్ ద్వార విచారించాలని నిర్ణయించారు. రెండు డివిజన్ బెంచులు, నలుగురు సింగిల్ జడ్జీల ధర్మాసనాలు అత్యవసర కేసులను మాత్రమే దర్యాప్తు చేయాలని మద్రాస్ హైకోర్టు నిర్ణయించింది. అత్యవసర కేసుల విచారణ జడ్జీల నివాస గృహాల నుంచి జరపాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టుతోపాటు సబార్డినేట్ కోర్టుల్లోనూ కొన్ని ఆంక్షలతో కేసుల విచారణ చేపట్టాలని హైకోర్టు కోరింది. 9 జిల్లా కోర్టుల్లో మాత్రం పరిమితసంఖ్యలో కేసులను విచారించేందుకు హైకోర్టు అనుమతించింది. జూన్ 30వతేదీ వరకు మద్రాస్ హైకోర్టులో ఆంక్షలు కొనసాగించనున్నారు. 

Updated Date - 2020-06-06T16:27:58+05:30 IST