ద్విచక్ర వాహనం ఢీకొని ముగ్గురికి గాయాలు

ABN , First Publish Date - 2022-01-20T06:17:19+05:30 IST

రోడ్డుపై వెళ్తున్న ముగ్గురు మహిళలను ద్విచక్రవాహ నం వెనుక నుంచి ఢీకొట్టడంతో ఇద్దరికి స్వల్పగాయాలు కాగా మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి.

ద్విచక్ర వాహనం ఢీకొని ముగ్గురికి గాయాలు

  ఒక మహిళ పరిస్థితి విషమం  

మర్రిగూడ, జనవరి 19: రోడ్డుపై వెళ్తున్న ముగ్గురు మహిళలను ద్విచక్రవాహ నం వెనుక నుంచి ఢీకొట్టడంతో ఇద్దరికి స్వల్పగాయాలు కాగా మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం మర్రిగూడ మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాల ప్రకారం... మర్రిగూడ గ్రామానికి చెందిన కొండాపురం అండాలు, రాజుపేటతండాకు చెందిన రమావత చంద్రకళ, గునగంటి యాదమ్మలు మండలకేంద్రంలో రాజుపేట చౌరస్తాకు నడుచుకుంటూ వెళ్తున్నారు. నాంపల్లి మండలం మాందాపురం గ్రామానికి చెందిన వట్టికోటి సురేష్‌ అనే యువకు డు ద్విచక్రవాహనంతో వెనుక నుంచి వారిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో చంద్రకళ, యాదమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. కొండాపురం అండాలు తలకు తీవ్రగాయాలయ్యాయి. సంఘటనా స్థలంలో ఉన్న మర్రిగూడ సర్పంచ నల్లా యాదయ్యగౌడ్‌ వారి ని చికిత్స నిమిత్తం మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అండాలును వై ద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలించారు. వాహనదారుడిని పట్టుకొని పో లీసులకు అప్పగించినట్లు సర్పంచ తెలిపారు. ఈ విషయంపై పోలీసులను సంప్రదించగా ప్రమాదంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-20T06:17:19+05:30 IST