రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
ABN , First Publish Date - 2021-10-20T05:14:44+05:30 IST
పూసపాటిరేగ మండలం చోడమ్మఅగ్రహారం సమీ పంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యా యని హెడ్ కానిస్టేబుల్ సింహాచలం తెలిపారు.
డెంకాడ(పూసపాటిరేగ): పూసపాటిరేగ మండలం చోడమ్మఅగ్రహారం సమీ పంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యా యని హెడ్ కానిస్టేబుల్ సింహాచలం తెలిపారు. విశాఖ జిల్లా ఆనందపురం గ్రా మంలోని ఒకే కుటుంబానికి చెందిన ఎన్.సాయి, రోహిణి, అలేఖ్యలు మంగళవా రం ఒకే బైకుపై తమ స్వగ్రామం నుంచి పైడిభీమవరం బంధువుల ఇంటికి వెళ్తు న్నారు. చోడమ్మఅగ్రహారం సమీపానికి వచ్చేసరికి బైకు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న డివైడర్కు ఢీకొట్టింది. దీంతో ఆ ముగ్గురు రోడ్డుపై పడి గాయాలపాలయ్యా రు. హెచ్సీ సింహాచలం, కానిస్టేబుల్ అప్పలనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సుందరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.