24 గంటల్లో ముగ్గురు చిన్నారుల మృతి

ABN , First Publish Date - 2021-11-16T14:40:26+05:30 IST

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని నార్త్ బెంగాల్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో 24 గంటల్లో ముగ్గురు శిశువులు మరణించిన విషాద ఘటన...

24 గంటల్లో ముగ్గురు చిన్నారుల మృతి

సిలిగురి (పశ్చిమబెంగాల్): పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని నార్త్ బెంగాల్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో 24 గంటల్లో ముగ్గురు శిశువులు మరణించిన విషాద ఘటన తాజాగా వెలుగుచూసింది.ముగ్గురు పిల్లల మృతికి కరోనా వైరస్ కారణం కాదని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఇంద్రజిత్ సాహా చెప్పారు. మెడికల్ కళాశాల ఆసుపత్రిలో తెల్లవారుజామున మరణించిన ముగ్గురు శిశువులు జ్వరం లేదా శ్వాసకోస సమస్యలు, కరోనా వైరస్ తో మరణించలేదని వారి మృతికి వేర్వేరు కారణాలున్నాయని వైద్యులు చెప్పారు.గత 24 గంటల్లో ఆసుపత్రిలో 13 మంది శిశువులు చేరగా వారిలో ఎవరికీ జ్వరం, శ్వాస కోశ సమస్యలు లేవని వైద్యులు వివరించారు.


Updated Date - 2021-11-16T14:40:26+05:30 IST