భారత్ నుంచి సింగపూర్‌కు వెళ్లిన ముగ్గురికి కరోనా పాజిటివ్!

ABN , First Publish Date - 2020-08-07T21:51:26+05:30 IST

గత నెల 25న ఇండియా నుంచి సింగపూర్ వెళ్లిన వారిలో ముగ్గురు భారతీయులు కరోనా బారినపడ్డట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే

భారత్ నుంచి సింగపూర్‌కు వెళ్లిన ముగ్గురికి కరోనా పాజిటివ్!

సింగపూర్: గత నెల 25న ఇండియా నుంచి సింగపూర్ వెళ్లిన వారిలో ముగ్గురు భారతీయులు కరోనా బారినపడ్డట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. సింగపూర్‌లోనూ ఈ మహమ్మారి విలయం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సింగపూర్‌లో శుక్రవారం రోజు కొత్తగా 242 కరోనా కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అంతేకాకుండా జూలై 25న భారత్ నుంచి సింగపూర్‌కు తిరిగొచ్చిన ముగ్గురు భారతీయులకు కరోనా వైరస్ సోకినట్లు గురువారం రోజు నిర్ధారణ అయిందన్నారు. ప్రస్తుతం వారు హోం క్వరెంటైన్‌లో ఉంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. సింగపూర్‌లో ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 54,797కు చేరింది. ఇందులో దాదాపు 48వేల మంది కరోనాను జయించి, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 27కు చేరింది. 


Updated Date - 2020-08-07T21:51:26+05:30 IST