జాన్స్ క్రీక్ సిటీ కౌన్సిల్ ఎన్నికల బరిలో ముగ్గురు భారతీయ అమెరికన్లు

ABN , First Publish Date - 2021-08-22T00:09:07+05:30 IST

అమెరికాలోని జాన్స్ క్రీక్ సిటీ కౌన్సిల్ ఎన్నికల్లో ముగ్గురు భారతీయ అమెరికన్లు పోటీ చేయనున్నారు. ఈ ఏడాది నవంబర్ 2న జరిగే సిటీ కౌన్సిల్ ఎన్నికల్లో జాన్స్ క్రీక్ సిటీ కౌన్సిల్ నుంచి దిలీప్ తుంకీ, రష్మి సింగ్, బాబ్ ఎర్రమిల్లి అనే ముగ్గురు ఎన్నారైలు పోటీ పడుతున్నారు.

జాన్స్ క్రీక్ సిటీ కౌన్సిల్ ఎన్నికల బరిలో ముగ్గురు భారతీయ అమెరికన్లు

అట్లాంటా: అమెరికాలోని జాన్స్ క్రీక్ సిటీ కౌన్సిల్ ఎన్నికల్లో ముగ్గురు భారతీయ అమెరికన్లు పోటీ చేయనున్నారు. ఈ ఏడాది నవంబర్ 2న జరిగే సిటీ కౌన్సిల్ ఎన్నికల్లో జాన్స్ క్రీక్ సిటీ కౌన్సిల్ నుంచి దిలీప్ తుంకీ, రష్మి సింగ్, బాబ్ ఎర్రమిల్లి అనే ముగ్గురు ఎన్నారైలు పోటీ పడుతున్నారు. వీరిలో దిలీప్ తుంకీ.. జాన్స్ క్రీక్ సిటీ కౌన్సిల్ పోస్ట్-1కు అర్హత సాధించగా, రష్మి సింగ్.. జాన్స్ క్రీక్ సిటీ కౌన్సిల్ పోస్ట్-2కు, బాబ్ ఎర్రమిల్లి.. జాన్స్ క్రీక్ సిటీ కౌన్సిల్ పోస్ట్-3కు అర్హత సాధించారు. తుంకీ 20 ఏళ్లుగా జాన్స్ క్రీక్‌లో నివాసముంటున్నారు. వ్యాపార రంగంలో ఆయనకు 27 ఏళ్ల అనుభవం ఉంది. స్థానికంగా ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయనకు భార్య పద్మ, కూతురు సింధు ఉన్నారు. ఇక బాబ్ ఎర్రమిల్లి అమెరికన్ ఎయిర్ ఫోర్స్‌లో 20 ఏళ్లు పని చేసిన అనుభవం ఉంది. యూఎస్ మెరైన్ కార్ప్స్, నేవీ విభాగాల్లో ఆఫ్రికా, పర్షియన్ గల్ఫ్, అఫ్ఘానిస్థాన్‌లో పని చేశారు.      

Updated Date - 2021-08-22T00:09:07+05:30 IST