ఇండియా నుంచి సింగ‌పూర్ వెళ్లిన ముగ్గురికి క‌రోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-07-05T18:24:40+05:30 IST

టీవ‌ల ఇండియా నుంచి సింగ‌పూర్ వెళ్లిన‌ ముగ్గురు క‌రోనా బారిన ప‌డ్డారు. వీరిలో ఇద్ద‌రు సింగ‌పూర్ పౌరులు, ఒక‌రు ప్ర‌వాస మ‌హిళ ఉన్నారు.

ఇండియా నుంచి సింగ‌పూర్ వెళ్లిన ముగ్గురికి క‌రోనా పాజిటివ్‌

సింగ‌పూర్ సిటీ: ఇటీవ‌ల ఇండియా నుంచి సింగ‌పూర్ వెళ్లిన‌ ముగ్గురు క‌రోనా బారిన ప‌డ్డారు. వీరిలో ఇద్ద‌రు సింగ‌పూర్ పౌరులు, ఒక‌రు ప్ర‌వాస మ‌హిళ ఉన్నారు. ఈ ముగ్గురికి కోవిడ్ టెస్టు నిర్వ‌హించ‌గా పాజిటివ్ అని తేలింది. దీంతో దేశ‌వ్యాప్తంగా ఈ వైర‌స్ సోకిన వారి సంఖ్య 44,664కు చేరింద‌ని సింగ‌పూర్ ఆరోగ్య‌శాఖ శనివారం వెల్ల‌డించింది. ‌జూన్ 21న ఈ ముగ్గురు భార‌త్ నుంచి సింగ‌పూర్ వెళ్ల‌గా వారిని హోం క్వారంటైన్‌కు ఆదేశించారు. ఈ నెల 2వ తేదీన‌ వీరికి క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌డంతో పాజిటివ్‌గా వ‌చ్చింది. ప్ర‌స్తుతం ముగ్గురిని ఐసోలేష‌న్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నామ‌ని ఆరోగ్య‌శాఖ అధికారులు తెలిపారు. ఇక శ‌నివారం దేశ‌వ్యాప్తంగా 185 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. వీటిలో 176 మంది వ‌స‌తి గృహాల‌లో నివాస‌ముండే వ‌ల‌స కార్మికులు ఉన్నారని ఆరోగ్య‌శాఖ పేర్కొంది. 

Updated Date - 2020-07-05T18:24:40+05:30 IST