ఆ ముగ్గురు బాలికలు దొరికారు!
ABN , First Publish Date - 2022-05-25T06:11:53+05:30 IST
తిరుపతిలో రెండురోజుల క్రితం అదృశ్యమైన ముగ్గురు బాలికలను మంగళవారం వారి తల్లిదండ్రులకు పుత్తూరు పోలీసులు అప్పగించారు
పుత్తూరు, మే 24 : తిరుపతిలో రెండురోజుల క్రితం అదృశ్యమైన ముగ్గురు బాలికలను మంగళవారం వారి తల్లిదండ్రులకు పుత్తూరు పోలీసులు అప్పగించారు.తిరుపతిలోని వేదాంతపురానికి చెందిన శాంతి(8), తేజస్విని(7), శోభారాణి(6) కనపడడం లేదని అవిలాల పోలీసులకు వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆ చిన్నారులు మంగళవారం పుత్తూరు రైల్వే స్టేషన్లో ప్రత్యక్షమయ్యారు.ఈ సమాచారం అందుకున్న పుత్తూరు సీఐ లక్ష్మీనారాయణ వారిని పోలీసు స్టేషన్కు తీసుకు వెళ్లి తిరుపతి పోలీసులకు సమాచారం అందించారు.వారిచ్చిన సమాచారంతో పుత్తూరుకు చేరుకున్న పిల్లల తల్లిదండ్రులకు వారిని అప్పగించారు.అయితే ఈ చిన్నారులు పుత్తూరుకు ఎలా చేరుకున్నారో సృష్టంగా చెప్పడం లేదు.ఇంటినుంచి ఆటోలో బస్టాండుకు చేరుకున్న చిన్నారులు బస్సెక్కి పుత్తూరుకు వెళ్లినట్టు తిరుపతి పోలీసులు చెబుతున్నారు.అలా అనుకున్నా ఈ రెండురోజులు తిండి, నిద్ర లేక ఎక్కడ వున్నారో తెలియడం లేదు.పోలీసుల పరిశోధనలోనే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.