ఆంధ్ర క్రికెట్ జట్టులో జిల్లావాసులు ముగ్గురికి చోటు
ABN , First Publish Date - 2021-02-24T04:55:32+05:30 IST
బీసీసీఐ ఆధ్వర్యంలో జరగనున్న అంతర్రాష్ట్ర మహిళా క్రికెట్ పోటీల్లో పాల్గొనే ఆంధ్ర జట్టులో కడప జిల్లాకు చెందిన శ్రీలక్ష్మి, రోజా, శిరీషలకు చోటు లభించింది.
కడప (ఎర్రముక్కపల్లె), ఫిబ్రవరి 23: బీసీసీఐ ఆధ్వర్యంలో జరగనున్న అంతర్రాష్ట్ర మహిళా క్రికెట్ పోటీల్లో పాల్గొనే ఆంధ్ర జట్టులో కడప జిల్లాకు చెందిన శ్రీలక్ష్మి, రోజా, శిరీషలకు చోటు లభించింది. ఆంధ్ర జట్టులో ముగ్గురు మహిళా క్రికెటర్లు ఎంపిక కావడం ఇదే తొలిసారి. ఇటీవల మంగళగిరిలో జరిగిన ఎంపిక పోటీల్లో జిల్లాకు చెందిన ఈ ముగ్గురూ అద్భుత ప్రతిభ ప్రదర్శించారు. వీరి ఎంపిక పట్ల జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షులు భరత్రెడ్డి, జిల్లా కార్యదర్శి సంజయ్కుమార్రెడ్డి, డీసీవో ఖాజా హర్షం వ్యక్తం చేశారు.
ఆల్రౌండర్ శిరీష
ప్రొద్దుటూరుకు చెందిన శిరీష ఆల్రౌండర్గా రాణిస్తున్నారు. ఫస్టియర్ డిగ్రీ చేస్తున్న శిరీష పలుమార్లు జిల్లాకు, స్టేట్లో జరిగే క్రికెట్ పోటీల్లో పాల్గొన్నారు. అలాగే అండర్-19, 23తో పాటు సీనియర్ జట్టులో కూడా పాల్గొన్నారు.
మీడియం ఫేస్ బౌలర్ శ్రీలక్ష్మి
కడప నగరానికి చెందిన శ్రీలక్ష్మి మీడియం ఫేస్ బౌలర్గా అండర్ 19, 23తో పాటు సీనియర్ జట్టులో రాణించారు. పీజీ చేస్తున్న శ్రీలక్ష్మి జట్టులో అందరికన్నా సీనియర్. పలుమార్లు జట్టు విజయానికి తన నైపుణ్యం ఎంతో దోహదపడింది.
వికెట్ కీపర్గా రోజా..
కడప నగరానికి చెందిన ఎన్.రోజా మంచి వికెట్ కీపర్గా గుర్తింపు పొందారు. ఈమె కూడా అండర్ 19, 23తో పాటు సీనియర్ జట్టులో పాల్గొన్నారు. డిగ్రీ పూర్తి చేసి తన పూర్తి సమయాన్ని క్రికెట్కే కేటాయించారు.