cloudburst: ఉత్తరాఖండ్‌ వరదల్లో ముగ్గురి దుర్మరణం

ABN , First Publish Date - 2021-07-19T13:18:55+05:30 IST

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర కాశీ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున కురిసిన భారీవర్షాలతో...

cloudburst: ఉత్తరాఖండ్‌ వరదల్లో ముగ్గురి దుర్మరణం

నలుగురు గల్లంతు

ఉత్తరకాశీ (ఉత్తరాఖండ్): ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర కాశీ  జిల్లాలో సోమవారం తెల్లవారుజామున కురిసిన భారీవర్షాలతో ఆకస్మిక వరదలు వెల్లువెత్తాయి. ఈ ఆకస్మిక వరదల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించగా, మరో నలుగురు గల్లంతయ్యారు. ఉత్తరకాశీ జిల్లా మండో గ్రామంలో సోమవారం తెల్లవారుజామున ఆకస్మిక వరదలు వెల్లువెత్తాయి. ఈ వరదల్లో మాధురి(42), రీతూ(38), ఇషూ (6)లు మరణించారు. వరదల అనంతరం సహాయ పునరావాస పనులు చేపట్టామని, గల్లంతైన వారి కోసం గాలిస్తున్నామని స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఇన్ చార్జి జగదాంబ ప్రసాద్ చెప్పారు. భారీవర్షాల వల్ల పలు గృహాలు నీటమునిగాయి. డ్రైనేజీ నీరు పొంగి ప్రవహించడంతో కొందరు వ్యక్తులు గల్లంతు అయ్యారని ఉత్తరకాశీ అధికారులు చెప్పారు. 


Updated Date - 2021-07-19T13:18:55+05:30 IST