roof collapses: కుప్పకూలిన భవనం...ముగ్గురి మృతి
ABN , First Publish Date - 2022-09-19T13:49:16+05:30 IST
భారీవర్షాలతో రెండు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో(building collapsed) ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించిన ఘటన...
లక్నో(ఉత్తరప్రదేశ్): భారీవర్షాలతో రెండు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో(building collapsed) ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించిన ఘటన ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలోని డియోరియా పట్టణంలో జరిగింది. సోమవారం ఉదయం రెండు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అందులో నివాసముంటున్న ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరణించిన వారిలో దిలీప్(35), చాందినీ(30), రెండేళ్ల కుమార్తె మరణించారు. స్థానిక ప్రజలు, పోలీసులు, సహాయసిబ్బంది హుటాహుటిన వచ్చి శిథిలాలను తొలగిస్తున్నారు. ముందు జాగ్రత్తగా కూలిన భవనం పక్కన ఉన్న ఇళ్లలోని జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో(rain-related incidents) గోడ కూలి 12 మంది కూలీలు మరణించారు. లక్నోలో 9 మంది, ఉన్నవ్ లో ముగ్గురు భారీవర్షాల వల్ల మృత్యువాత పడ్డారు.