మూడ్రోజుల్లో బియ్యం పంపిణీ: అదనపు కలెక్టర్‌ నగేశ్‌

ABN , First Publish Date - 2020-03-25T13:10:46+05:30 IST

చేర్యాలలో మంగళవారం కొనసాగాల్సిన వారాంతపుసంత రద్దవడంతో ఉగాది పండగ సందర్భంగా కూరగాయలు, మట్టికుండలు, ఇతరత్రా సామగ్రి కొనుగోలుకు జనాలు ఒక్కొక్కరిగా దుకాణాల వద్దకు చేరుకున్నారు. రద్దీ ఎక్కువవుతున్న విషయం

మూడ్రోజుల్లో బియ్యం పంపిణీ: అదనపు కలెక్టర్‌ నగేశ్‌

మెదక్‌ రూరల్‌, మార్చి 24: సివిల్‌ సప్లయ్స్‌ గోదాముల నుంచి మూడ్రోజుల్లో బియ్యం సరఫరా చేయాలని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సివిల్‌ సప్లయ్స్‌ స్టేజ్‌-1, స్టేజ్‌ -2 కాంట్రాక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి లబ్ధిదారుడికి 6 కిలోల బదులు 12 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. 35 కిలోల లబ్ధిదారుడి ఇంట్లో ఇద్దరికంటే ఎక్కువగా ఉంటే ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున ఇవ్వాలన్నారు. అన్నపూర్ణ లబ్ధిదారులకు కూడా 10 కిలోలకు బదులుగా 12 కిలోలు ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. చౌక ధరల దుకాణంలో స్థలం లేకుంటే హస్టల్స్‌, స్కూల్స్‌, పంచాయతీ భవనాల్లో బియ్యం నిల్వ చేసుకోవాలన్నారు.


ప్రతి లబ్ధిదారుడు క్యూలో సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. బియ్యం పంపిణీ అనంతరం గన్నీ బ్యాగులను సత్వరమే ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు పంపాలన్నారు. స్టేజ్‌-1, స్టేజ్‌-2 ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జిని అందరూ కలిసి ఎలాంటి ఆటంకం లేకుండా మూడ్రోజుల్లో షాపులకు పంపిణీ చేయాలని ఆదేశించారు.సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ రాజునాయక్‌, డిప్యూటీ తహసీల్దార్‌ సాధిక్‌ హుస్సేన్‌, ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జితో పాటు కాంట్ర్టార్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-25T13:10:46+05:30 IST