Telanganaలో మరో 3 రోజులు విద్యాసంస్థలకు సెలవులు

ABN , First Publish Date - 2022-07-13T21:36:21+05:30 IST

రాష్ట్రంలో విద్యాసంస్థలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు పొడిగించింది.

Telanganaలో మరో 3 రోజులు విద్యాసంస్థలకు సెలవులు

హైదరాబాద్ (Hyderabad): రాష్ట్రంలో విద్యాసంస్థల(Educational Institutions)కు తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) సెలవులు (holidays) పొడిగించింది. రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమ, మంగళ, బుధవారాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. కాగా బుధవారంతో సెలవులు ముగుస్తున్నాయి. కానీ రాష్ట్రంలో వర్షాలు ఏ మాత్రం తగ్గలేదు. అన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో మూడు రోజులు విద్యాసంస్థలకు సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గురు, శుక్ర,  శనివారాల్లో కూడా విద్యాసంస్థలు బంద్ కానున్నాయి. తిరిగి వచ్చే సోమవారం విద్యాసంస్థలు పున:ప్రారంభం కానున్నాయి. మరో వైపు రేపటి నుంచి ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విస్తారంగా వర్షాలు కురవడంతో రేపు, ఎల్లుండి జరగాల్సిన అగ్రికల్చర్ పరీక్షలు వాయిదా వేసినట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఇంజనీరింగ్ పరీక్షలు మాత్రం యథాతథం జరుగుతాయని పేర్కొంది.

Updated Date - 2022-07-13T21:36:21+05:30 IST