యూపీలో ముగ్గురు దళిత సోదరీమణులపై యాసిడ్ దాడి

ABN , First Publish Date - 2020-10-13T16:37:58+05:30 IST

హాథ్రస్ ఘటన మరవక ముందే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన జరిగింది....

యూపీలో ముగ్గురు దళిత సోదరీమణులపై యాసిడ్ దాడి

గోండా (ఉత్తరప్రదేశ్): హాథ్రస్ ఘటన మరవక ముందే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన జరిగింది. దళితవర్గానికి చెందిన ముగ్గురు సోదరిమణులపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ తో దాడి చేశాడు. గోండా పట్టణానికి చెందిన 8,12,17 సంవత్సరాల వయసు గల ముగ్గురు దళిత సోదరీమణులు సోమవారం రాత్రి నిద్రపోతుండగా వారిపై గుర్తుతెలియని వ్యక్తి ఒకరు యాసిడ్ తో దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరు బాలికలకు స్వల్పంగా కాలిన గాయాలయ్యాయి. మరో బాలిక ముఖంపై గాయమైంది. 


యాసిడ్ దాడిలో గాయపడిన ముగ్గురు బాలికలను జిల్లాకేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఈ యాసిడ్ దాడి ఎవరు చేశారు, ఎందుకు చేశారనేది తెలియరాలేదు. పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2020-10-13T16:37:58+05:30 IST