ఊరుకోం.. ఉద్యమమై ఉరికొస్తాం
ABN , First Publish Date - 2020-08-03T09:36:46+05:30 IST
మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు భగ్గుమంటున్నారు. ప్రజల మనసెరిగి పాలకులు వ్యవహరించడం లేదని, గవర్నర్ బిల్లులు..
ఆంధ్రజ్యోతి, విజయవాడ : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు భగ్గుమంటున్నారు. ప్రజల మనసెరిగి పాలకులు వ్యవహరించడం లేదని, గవర్నర్ బిల్లులు ఆమోదించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో ఆదివారం అమరావతి జేఏసీ నేతలకు, ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవారికి పోలీసులు నోటీసులు ఇచ్చి గృహ నిర్బంధం చేశారు. ఇలాంటి నిర్బంధాలు ఏమీ చేయలేవని, ఊరుకోబోమని.. ఉద్యమమై ఉరికొస్తామని, అమరావతే మా ఊపిరి అని అవసరమైతే ప్రాణత్యాగాలకైనా సిద్ధమని రాజధాని ఉద్యమకారులు స్పష్టం చేశారు. గుంటూరులో టీడీపీ నేతలు కాగడాల ప్రదర్శన చేశారు.