విద్యుదాఘాతంతో మూడు గేదెలు మృతి

ABN , First Publish Date - 2022-08-11T06:04:32+05:30 IST

మండలంలోని దాచారం గ్రామంలో విద్యుదాఘాతంతో మహిళా రైతు జొర్క జానకమ్మకు చెందిన మూడు గేదెలు బుధవారం మృతి చెందాయి.

విద్యుదాఘాతంతో మూడు గేదెలు మృతి

ఆత్మకూర్‌(ఎస్‌), ఆగస్టు 10: మండలంలోని దాచారం గ్రామంలో విద్యుదాఘాతంతో మహిళా రైతు  జొర్క జానకమ్మకు చెందిన మూడు గేదెలు బుధవారం మృతి చెందాయి.  గ్రామంలో చెందిన రైతు  బస్వరాజు వీరయ్య తన వ్యవసాయ బోర్‌ మోటార్‌ కోసం విద్యుత్‌ తీగలను కర్రకు వేలాడదీశాడు.  గేదెలు వెళ్లిన సమయంలో  కర్ర విరిగి  విద్యుత్‌ తీగలు కింద పడి మూడు గేదెల కాళ్లకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాయి. మృతి చెందిన గేదెల విలువ రూ.1.20లక్షలు ఉంటుందని తనన ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు జానకమ్మ కోరారు. 



Updated Date - 2022-08-11T06:04:32+05:30 IST