యువతిని మోసం చేసి తన తమ్ముడికి పెళ్లి చేసిన యువకుడు.. ఆ తరువాత ఆమెను ఇంట్లో బంధించి.. ముగ్గురు అన్నదమ్ముల ఘాతుకం..

ABN , First Publish Date - 2022-03-14T05:47:29+05:30 IST

వివాహితుడైన ఒక వ్యక్తికి ఓ యువతితో పరిచయమైంది.. అతడు తరచుగా ఆమెతో మాట్లాడేవాడు.. అప్పుడప్పుడు ఆ యువతి ఇంటికి కూడా వెళ్లేవాడు.. కొన్ని రోజుల కిందట తన ఫ్యామిలీ ఫంక్షన్‌కు రావాలని చెప్పి ఆమెను ఆహ్వానించాడు..

యువతిని మోసం చేసి తన తమ్ముడికి పెళ్లి చేసిన యువకుడు.. ఆ తరువాత ఆమెను ఇంట్లో బంధించి.. ముగ్గురు అన్నదమ్ముల ఘాతుకం..

వివాహితుడైన ఒక వ్యక్తికి ఓ యువతితో పరిచయమైంది. అతడు తరచుగా ఆమెతో మాట్లాడేవాడు.. అప్పుడప్పుడు ఆ యువతి ఇంటికి కూడా వెళ్లేవాడు. కొన్ని రోజుల కిందట తన ఫ్యామిలీ ఫంక్షన్‌కు రావాలని చెప్పి ఆమెను ఆహ్వానించాడు.. ఆమెను వేరే ఊరికి తీసుకెళ్లి బలవంతంగా తన తమ్ముడికిచ్చి పెళ్లి చేశాడు.. అనంతరం ముగ్గరూ కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 


వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాకు చెందిన ఓ యువతికి పోస్టాఫీస్‌లో పనిచేసే జగ్మాల్ అనే వ్యక్తితో పరిచయమైంది. వారిద్దరి మధ్యా స్నేహం ఏర్పడింది. జగ్మాల్ తరచుగా ఆమె ఇంటికి వెళ్లేవాడు. గత నెలలో అతను ఆమెను తన ఇంటి ఫంక్షన్‌కు ఆహ్వానించాడు. ఫంక్షన్ కోసమని చెప్పి వేరే ఊరికి తీసుకెళ్లాడు. అక్కడ బలవంతంగా తన తమ్ముడు హర్ఖా రామ్‌తో ఆ యువతి పెళ్లి చేశాడు. హర్ఖా రామ్‌ ఆమెను నాలుగు రోజుల పాటు అత్యాచారం చేశాడు. అనంతరం హర్ఖా రామ్‌ పనిమీద వేరే ఊరు వెళ్లాడు.


ఆ సమయంలో జగ్మాల్ తన తమ్ముడి భార్య అని కూడా చూడకుండా ఆమెను గదిలో బంధించి 45 రోజులపాటు అత్యాచారం చేశాడు. జగ్మాల్ లేని సమయంలో అతని మరో సోదరుడు హక్మారామ్ కూడా యువతిపై అత్యాచారం చేశాడు.


ఈ క్రమంలో ఆ యువతి ఒకరోజు అదును చూసి తన తల్లికి ఫోన్ చేసి తన ఆచూకీ తెలిపింది. చివరకు ఆ యువతి తల్లి పోలీసుల సహాయంతో ఆమెను కాపాడింది. పోలీసులు తమకోసం గాలిస్తున్నారని తెలిసి జగ్మాల్, అతని ఇద్దరు సోదరులు పరారయ్యారు. పోలీసులు ఆ ముగ్గురు సోదరులపై కిడ్నాప్, అత్యాచారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2022-03-14T05:47:29+05:30 IST