ఒకే కాన్పులో ముగ్గురు శిశువుల జననం
ABN , First Publish Date - 2021-03-07T06:39:23+05:30 IST
మచిలీపట్నం చిన్నాపురం ఆసుపత్రిలో ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలు జన్మించారు. మేడిశెట్టి వీరవెంకట గంగ ఒక మగ శిశువు, ఇద్దరు ఆడశిశువులకు జన్మనిచ్చింది.
తల్లీ పిల్లలు సురక్షితం
మచిలీపట్నం టౌన్, మార్చి 6 : మచిలీపట్నం చిన్నాపురం ఆసుపత్రిలో ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలు జన్మించారు. మేడిశెట్టి వీరవెంకట గంగ ఒక మగ శిశువు, ఇద్దరు ఆడశిశువులకు జన్మనిచ్చింది. డాక్టర్ రాళ్లపల్లి వినీష, డాక్టర్ రామప్రసాద్ శస్త్రచికిత్స చేశారు. పిల్లల్లో ఎక్కువ బరువు ఉండటం కూడా గమనార్హం. మగ శిశువు అందరికంటే పెద్ద శిశువుగా డాక్టర్ వినీష తెలిపారు. గర్భిణిగా ఉన్న సమయంలోనే ఈమెకు మూడు పిండాలు ఉన్నట్టు గమనించామన్నారు. కాగా ఒక మాయలో మగ శిశువు, రెండో మాయలో ఇద్దరు ఆడ శిశువులు ఉన్నారన్నారు. పిల్లలను ప్రత్యేక బాక్సులో పెట్టలేదని, ఆరోగ్యంగా తల్లి, బిడ్డలు ఉన్నారన్నారు. ఇలాంటి ప్రత్యేక సన్నివేశాల్లో తల్లి పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో విజయవంతంగా ఆపరేషన్ చేయగలిగామని డాక్టర్ వినీష తెలిపారు. 26 ఏళ్ల క్రితం ఇలా మూడు శిశువుల జననం జిల్లాలో నమోదయినట్లు డాక్టర్ తెలిపారు. బాలింతరాలు వీరవెంకట గంగ భర్త హరిశంకర్ ఎలక్ర్టీషీయన్గా డోకిపర్రు వేంకటేశ్వరస్వామి దేవాలయంలో పనిచేస్తున్నారు.