తుపాకులతో సంచరిస్తున్న ముగ్గురి అరెస్ట్

ABN , First Publish Date - 2022-06-13T21:59:40+05:30 IST

మాదాపూర్: మియపూర్‌లో తుపాకులతో సంచరిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఒక పిస్తోల్, తాపంచ, రెండు మ్యాగజైన్‌లు, 13 బుల్లెట్లు, 6 మొబైల్

తుపాకులతో సంచరిస్తున్న ముగ్గురి అరెస్ట్

మాదాపూర్: మియపూర్‌లో తుపాకులతో సంచరిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఒక పిస్తోల్, తాపంచ, రెండు మ్యాగజైన్‌లు, 13 బుల్లెట్లు, 6 మొబైల్ ఫోన్లు, ఆక్టివా వాహనం, కారు స్వాధీనం చేసుకుని మీడియాకు వారి వివరాలు తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలకు తుపాకులతో సంచరిస్తున్నారన్న పక్క సమాచారం‌తో ముగ్గురికి అదుపులోకి తీసుకున్నామని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. పాత నేరస్థుడు స్వాన్ లియోనార్డ్ అలియాస్ కన్నా(34)ను అరెస్ట్ చేశామని, ఇతని వెనక  బొలెరో కారులో వస్తున్న మరో ఇద్దరు సాయిరాం, సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కన్నాపై కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ నమోదైందని, వీరి వద్ద ఉన్న వెపన్స్ బీహార్ నుంచి తెచ్చినట్టు గుర్తించామన్నామన్నారు. రౌడీ షీటర్లు, పాత నేరస్థుల కదలికలపై పోలీస్ నిఘా ఉండటంతో అరెస్ట్ చేశామన్నారు. నిందితులకు తుపాకులు సమకూర్చిన బీహార్‌కు చెందిన ఆలోక్ పరారీలో ఉన్నాడని డీసీపీ తెలిపారు.  

Updated Date - 2022-06-13T21:59:40+05:30 IST