వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి అరెస్టు

ABN , First Publish Date - 2020-06-05T09:49:36+05:30 IST

అక్రమంగా రేషన్‌ బియ్యం నిల్వ ఉంచిన, తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి అరెస్టు

మదీన, జూన్‌ 4: అక్రమంగా రేషన్‌ బియ్యం నిల్వ ఉంచిన, తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 12 క్వింటాళ్ల బియ్యం, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఫలక్‌నుమా చార్‌చమన్‌ ప్రాంతంలో నివసిస్తున్న షేక్‌ మొయినుద్దీన్‌ (30), మహ్మద్‌ అమాన్‌ (28) రేషన్‌కార్డులున్న వారి వద్ద తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫలక్‌నుమా పోలీసులు వారి స్థావరంపై దాడిచేసి నిల్వ ఉంచిన ఆరు క్వింటాళ్ల బియ్యం, ఆటో స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని ఇన్‌స్పెక్టర్‌ చంద్రకుమార్‌ తెలిపారు.  


కాలాపత్తర్‌లో...

దక్షిణమండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, సివిల్‌ సప్లై అధికారులు సంయుక్తంగా దాడిచేసి రేషన్‌ బియ్యం అక్రమంగా తరలిస్తున్న కాలాపత్తర్‌ కిజ్రా హోటల్‌ ప్రాంతానికి చెందిన షేక్‌ ఫషీ (28)ని అరెస్టు చేశారు. అతడి నుంచి ఆరు క్వింటాళ్ల బియ్యం, ఆటో స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2020-06-05T09:49:36+05:30 IST