ఎండు గంజాయి విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు
ABN , First Publish Date - 2021-07-27T03:58:37+05:30 IST
మెదక్లోని పిట్లం చెరువు వద్ద ఎండు గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురు యువకులను ఎక్సైజ్ శాఖ జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు సోమవారం పట్టుకున్నారు.
మెదక్ అర్బన్, జూలై 26: మెదక్లోని పిట్లం చెరువు వద్ద ఎండు గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురు యువకులను ఎక్సైజ్ శాఖ జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ సీఐ సూరా కృష్ణ బృందం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఫతేనగర్వాసి ప్రవీణ్, రాజ్పల్లికి గ్రామానికి చెందిన షేక్ అర్షద్, స్థానిక కొలిగడ్డకు చెందిన రాజును అదుపులోకి తీసుకొని, వారి నుంచి రూ.15 వేల విలువ చేసే 50 ఎండు గంజాయి ప్యాకెట్లను, మూడు సెల్ఫోన్లు, ఒక బైక్, రూ.3,680 నగదును స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ కృష్ణ తెలిపారు.