నెల్లూరు జిల్లాలో సర్పంచ్‌కు బెదిరింపులు

ABN , First Publish Date - 2022-04-10T16:44:13+05:30 IST

జిల్లాలోని చుంచులూరు వైసీపీ దళిత సర్పంచ్‌కు రోజురోజుకూ బెదిరింపులు ఎక్కువవుతున్నాయి.

నెల్లూరు జిల్లాలో సర్పంచ్‌కు బెదిరింపులు

నెల్లూరు: జిల్లాలోని చుంచులూరు వైసీపీ దళిత సర్పంచ్‌కు రోజురోజుకూ బెదిరింపులు ఎక్కువవుతున్నాయి.  మర్రిపాడు జడ్పీటీసీ మల్లు సుధాకర్‌రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ దళిత సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీలో అభివృద్ధి పనులు.. తాను చెప్పిన వారే చేయాలంటూ జడ్పీటీసీ హుకుం జారీ చేశారు. దళిత సర్పంచులను చిన్నచూపు చూస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. జడ్పీటీసీ ఆగడాలపై సోమవారం మర్రిపాడులో దళిత సంఘాలతో కలిసి ధర్నా చేస్తానని సర్పంచ్‌ అన్నాడు.

Updated Date - 2022-04-10T16:44:13+05:30 IST