క్రిప్టో కరెన్సీలతో ముప్పు: ఆర్‌బీఐ గవర్నర్‌

ABN , First Publish Date - 2021-02-25T06:16:33+05:30 IST

దేశ ఆర్థిక స్థిరత్వంపై క్రిప్టోకరెన్సీల ప్రభావం గురించి ఆర్‌బీఐ తీవ్ర ఆందోళన

క్రిప్టో కరెన్సీలతో ముప్పు: ఆర్‌బీఐ గవర్నర్‌

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక స్థిరత్వంపై క్రిప్టోకరెన్సీల ప్రభావం గురించి ఆర్‌బీఐ తీవ్ర ఆందోళన ప్రకటించింది. క్రిప్టో కరెన్సీల విషయంలో తమకు తీవ్ర ఆందోళనలున్నాయని, వాటిపై తాము ప్రకటించిన వైఖరి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ చెప్పారు. త్వరలోనే ప్రభుత్వం వీటిపై ఒక స్పష్టమైన వైఖరి తీసుకుని అవసరమైతే పార్లమెంటు ముందు ఉంచుతుందన్న విశ్వా సం ఉందన్నారు.

బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ పూర్తిగా భిన్నమైనదని, దాని ప్రయోజనాలను పూర్తిగా వినియోగించుకోవాల్సి ఉంటుందని, క్రిప్టో కరెన్సీల విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిందేనని ఖండితంగా చెప్పారు. 


Updated Date - 2021-02-25T06:16:33+05:30 IST