అమ్మవారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు
ABN , First Publish Date - 2022-05-20T04:58:38+05:30 IST
పంచాయతీలోని కొత్తకోడూరులో గురువారం వైభవంగా గంగమ్మ తల్లి జాతర నిర్వహించారు.
రైల్వేకోడూరు, మే 19: పంచాయతీలోని కొత్తకోడూరులో గురువారం వైభవంగా గంగమ్మ తల్లి జాతర నిర్వహించారు. బుధవారం రాత్రి గంగమ్మ తల్లి ప్రతిమ ను తయారు చేసి కొత్తకోడూరు వీధుల్లో ఊరేగించారు. భక్తులు గంగమ్మతల్లికి కో ళ్లు, మేకపోతులు, పొట్టేళ్లు బలి ఇచ్చారు. వివిధ రకాల పూలతో అమ్మవారిని అలంకరించారు. తప్పెట్లు, డ్రమ్స్, వివిధ రకాల వేషాలు అలరించాయి. జాతర కమిటీ ఆధ్వర్యంలో అన్నదానాలు చేశారు. అంబేడ్కర్ నగర్లో గంగమ్మతల్లి జాతర నిర్వహించారు. పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు.