సాగునీటి కోసం రైతుల పాట్లు

ABN , First Publish Date - 2020-08-04T10:31:56+05:30 IST

తోటపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు ఉన్నా సాగునీటి కోసం మండల రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.

సాగునీటి కోసం రైతుల పాట్లు

గరుగుబిల్లి, ఆగస్టు 3 : తోటపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు ఉన్నా సాగునీటి కోసం మండల రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. నిధుల కొరతతో కనీసం పిచ్చి మొక్కలు, పూడికతీత పనులు చేయలేని పరిస్థితి. ఒకవైపు పర్యవేక్షణ, మరోవైపు నిధుల కొరతతో అంతగా అధికారులు దృష్టి సారించడం లేదు. దీంతో రైతులే స్వచ్ఛందంగా నిధులు సమకూర్చుకుని కాలువలను శుభ్రం చేసుకుంటున్నారు. సోమవారం కొంకడివరం, సీతారాంపురం గ్రామా లకు చెందిన రైతులు స్వచ్ఛందంగా పూడికతీ తలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్‌ అల్లు అప్పలనాయుడు మాట్లాడుతూ సుమారు 200 ఎకరాలకు పైగా సాగునీరందాల్సి ఉన్నా అందని పరిస్థితి ఏర్పడిందరనన్నారు. సాగునీరును మళ్లించేందుకు రైతులే సొంతంగా నిధులు సమకూర్చుకుని పనులు నిర్వహించుకుంటున్నారన్నారు.

Updated Date - 2020-08-04T10:31:56+05:30 IST