‘తోటపల్లి’ నీరందేలా కృషి
ABN , First Publish Date - 2020-12-06T05:23:44+05:30 IST
తోటపల్లి కాలువ ద్వారా సాగునీరు అందేలా తన వంతు కృషి చేస్తానని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు హామీ ఇచ్చారు.
టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు ‘కళా’
రాజాం, డిసెంబరు 5: తోటపల్లి కాలువ ద్వారా సాగునీరు అందేలా తన వంతు కృషి చేస్తానని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు హామీ ఇచ్చారు. శనివారం రణస్థలం మండలం ఎర్రవరం పంచాయతీ టీడీపీ నాయకులు ఆయనను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా గ్రామ సమస్యలతోపాటు తోటపల్లి కాలువ ద్వారా సాగునీరు అందడంలేదని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించిన కళా వెంటనే ప్రాజెక్టు అధికారులతో ఫోన్లో మాట్లాడి సకాలంలో సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. త్వరలోనే పార్టీకి మంచి రోజులు వస్తాయని, రాబోయే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని కళా నాయకులు సూచించారు. కార్యక్రమంలో మాతా వెంకట రావు, మాతా అప్పారావు, బోనేల సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.