ఉద్యోగిపై దాడిచేసిన వారిని అరెస్టు చేయాలి

ABN , First Publish Date - 2022-08-19T04:50:17+05:30 IST

కడప కార్పొరేషన్‌ మాసాపేట సచివాలయం లో ప్లానింగ్‌ సెక్రటరీగా పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగి హరిపై దాడిచేసిన భవన యజమానులను వెంటనే అరె స్టు చేయాలని గ్రామ,వార్డుసచివాలయ ఎంప్లాయీస్‌ రాష్ట్ర అధ్యక్షుడు గుడినాగ రాజ డిమాండ్‌ చేశాడు.

ఉద్యోగిపై దాడిచేసిన వారిని అరెస్టు చేయాలి
మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నిరసన చేస్తున్న సచివాలయ ఉద్యోగులు

మదనపల్లె రూరల్‌, ఆగస్టు 18: కడప కార్పొరేషన్‌ మాసాపేట సచివాలయం లో ప్లానింగ్‌ సెక్రటరీగా పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగి హరిపై దాడిచేసిన భవన యజమానులను వెంటనే అరె స్టు చేయాలని గ్రామ,వార్డుసచివాలయ ఎంప్లాయీస్‌ రాష్ట్ర అధ్యక్షుడు గుడినాగ రాజ డిమాండ్‌ చేశాడు. ఈ మేరకు గురు వారం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట దాడిచేసిన వారిని అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని సచివాలయ ఉద్యోగులతో కలసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగిపై దాడిచేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా సచివా లయ ఉద్యోగులు ఆందోళన లు చేపడుతామన్నారు. కార్యక్రమంలో గ్రామ,వార్డు సచివా లయాల ఎంప్లాయీస్‌ సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, నాయకులు హరికి రణ్‌రెడ్డి, ముజాహిద్దీన్‌, అభిషేక్‌, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-19T04:50:17+05:30 IST