‘‘పాక్ అనుకూలంగా నినాదాలు చేసే వారిని కాల్చి చంపాలి’’

ABN , First Publish Date - 2020-02-25T14:07:28+05:30 IST

పాకిస్థాన్ దేశానికి అనుకూలంగా నినాదాలు చేసే వారిని కాల్చి చంపాలని కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అప్పచురంజన్ డిమాండ్ చేశారు....

‘‘పాక్ అనుకూలంగా నినాదాలు చేసే వారిని కాల్చి చంపాలి’’

కర్ణాటక ఎమ్మెల్యే  డిమాండ్

బెంగళూరు : పాకిస్థాన్ దేశానికి అనుకూలంగా నినాదాలు చేసే వారిని కాల్చి చంపాలని కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అప్పచురంజన్ డిమాండ్ చేశారు. ‘‘బెంగళూరులో సీఏఏ వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్న ఓ యువతి పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసింది, మన దేశంలో ఉండి, మన ఆహారాన్ని తింటూ, మన నీళ్లు తాగుతూ ఇలాంటి నినాదాలు చేసే వారిని చూడగానే కాల్చి చంపాలి’’ అని ఎమ్మెల్యే అప్పచు రంజన్ కోరారు. మన దేశానికి వ్యతిరేకంగా పాక్ కు అనుకూలంగా నినాదాలు చేసిన నేరస్థులకు న్యాయ సహాయం కూడా చేయరాదని ఎమ్మెల్యే కోరారు. దేశ ద్రోహుల తరపున న్యాయస్థానాల్లో ఏ లాయరు కూడా వాదించకూడదు, వారి పట్ల కఠిన వైఖరి అవలంబించాలని ఎమ్మెల్యే సూచించారు. దేశానికి వ్యతిరేకంగా పాకి్ కు అనుకూలంగా నినాదాలు చేసే వారిని షూట్ ఎట్ సైట్ చట్టం తీసుకురావాలని అప్పచురంజన్ డిమాండు చేశారు.ఈ విషయమై ప్రధానమంత్రి నరేంద్రమోదీని అభ్యర్థిస్తానని ఎమ్మెల్యే చెప్పారు. 

Updated Date - 2020-02-25T14:07:28+05:30 IST