18 ఏళ్లు దాటిన వారు బూస్టర్ డోస్ వేసుకోవాలి
ABN , First Publish Date - 2022-08-12T05:18:45+05:30 IST
రోనా బూస్టర్ డోస్ను 18 ఏళ్లు దాటిన వారందరూ వేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎ.హేమంత్ కోరారు.
జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి హేమంత్
బుచ్చెయ్యపేట, ఆగస్టు 12: కరోనా బూస్టర్ డోస్ను 18 ఏళ్లు దాటిన వారందరూ వేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎ.హేమంత్ కోరారు. గురువారం ఆయన వడ్డాది, బుచ్చెయ్యపేట పీహెచ్సీలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను తనిఖీ చేశారు. పీహెచ్సీతోపాటు పరిసరాలను పరిశీలించారు. వడ్డాది పీహెచ్సీ నిర్ధేశించిన డెలివరీ లక్ష్యాలను పూర్తి చేయలేకపోవడంపై డాక్టరు మౌనికను ప్రశ్నించారు. నాడు-నేడు పథకంలో పీహెచ్సీ అభివృద్ధి పనులు సంవత్సరాల కాలంగా కొనసాగుతుండడంతో డెలీవరి కేసులు లక్ష్యాలను చేరుకోలేకపోతున్నామని మౌనిక తెలిపారు. సమస్యను అధిగమించి డెలీవరి సంఖ్యను పెంచాలని డాక్టరు మౌనికను ఆదేశించారు. పీహెచ్సీల్లో బూస్టర్ డోస్ వాక్సిన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సచివాలయాల్లో ప్రతి సోమ, శుక్రవారాలో బూస్టర్ డోస్ వ్యాక్సిన్ వేస్తారన్నారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారందరూ బూస్టర్ డోస్ తప్పనిసరిగా వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బుచ్చెయ్యపేట పీహెచ్సీ వైద్యాధికారి డాక్టరు వెంకట సాయి, సీహెచ్ఓ దేముడు, ఫార్మసిస్టు చంద్రమౌళీ పాల్గొన్నారు.