ఆ ఆరుగురికి ‘థార్‌’!

ABN , First Publish Date - 2021-01-24T10:17:44+05:30 IST

ఆస్ట్రేలియాతో టెస్ట్‌ సిరీ్‌సలో అద్భుతంగా రాణించిన ఆరుగురు టీమిండియా క్రికెటర్లకు ప్రముఖ ..

ఆ ఆరుగురికి ‘థార్‌’!

ముంబై: ఆస్ట్రేలియాతో టెస్ట్‌ సిరీ్‌సలో అద్భుతంగా రాణించిన ఆరుగురు టీమిండియా క్రికెటర్లకు ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూపు చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా తమ సరికొత్త ఎస్‌యూవీ ‘థార్‌’ను బహుమతిగా ప్రకటించారు. టెస్ట్‌ సిరీ్‌సను భారత జట్టు గెలుచుకోవడంలో కీలక భూమిక పోషించిన అరంగేట్ర ఆటగాళ్లు మహ్మద్‌ సిరాజ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, నటరాజన్‌, శుభమన్‌ గిల్‌, నవ్‌దీప్‌ సైనీతోపాటు శార్దూల్‌ ఠాకూర్‌కు కూడా ఈ బహుమతి అందజేయనున్నట్టు ఆయన తెలిపారు.  

Updated Date - 2021-01-24T10:17:44+05:30 IST