చాంపియన్లను ఇంటికి ఆహ్వానించిన ప్రధాని
ABN , First Publish Date - 2022-05-16T09:05:19+05:30 IST
థామస్ కప్ను తొలిసారి సొంతం చేసుకున్న సందర్భంగా భారత షట్లర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇండోనేసియాతో పోటీ ముగిసిన
న్యూఢిల్లీ: థామస్ కప్ను తొలిసారి సొంతం చేసుకున్న సందర్భంగా భారత షట్లర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇండోనేసియాతో పోటీ ముగిసిన వెంటనే షట్లర్లతో మోదీ ఫోన్లో సంభాషించారు. భారత్ చేరుకోగానే తన నివాసానికి రావాలంటూ షట్లర్లను ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పీఎంఓ సిబ్బంది చూసుకుంటారని వారితో మోదీ చెప్పారు. తొలుత కిడాంబి శ్రీకాంత్తో ముచ్చటించిన ప్రధాని.. ఆ తర్వాత లక్ష్యసేన్, ప్రణయ్, చిరాగ్తో మాట్లాడారు. ‘క్రీడారంగంలో భారత్ సాధించిన అద్భుతమైన విజయాల్లో ఇదొకటి. మీ అందరి సమష్ఠి కృషితో ఇది సాధ్యమైంది’ అని మోదీ అభినందించారు.