నెలలోనే 43% పెరిగిన ఈ ప్రైవేటు సెక్టార్ బ్యాంక్ స్టాక్
ABN , First Publish Date - 2022-08-05T20:18:25+05:30 IST
టీవలి కాలంలో ప్రైవేటు సెక్టార్ బ్యాంక్ కరూర్ వైశ్యా షేర్లు తమ ర్యాలీని కొసాగిస్తున్నాయి.
Karur Vyshya Bank : ఇటీవలి కాలంలో ప్రైవేటు సెక్టార్ బ్యాంక్ కరూర్ వైశ్యా షేర్లు తమ ర్యాలీని కొసాగిస్తున్నాయి. నేడు కూడా ఈ ర్యాలీని కొనసాగించాయి. శుక్రవారం ఇంట్రా డేలో కరూర్ వైశ్యా బ్యాంకు స్టాక్ 4 శాతం లాభపడి రెండేళ్ల గరిష్టం రూ.63.35కి చేరుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్తో ముగిసిన త్రైమాసికంలో అదిరిపోయే ఫలితాలను వెల్లడించిన తరువాత ఈ బ్యాంకు అదరగొడుతోంది.
గడిచిన ఒక నెలలో కరూర్ వైశ్యా బ్యాంక్ షేర్లు 43 శాతం లాభపడ్డాయి. ఇదే సమయంలో ఎస్అండ్పీ బీఎస్ఈ సెన్సెక్స్లో 10 శాతం పెరిగింది. డిసెంబర్ 2019 నుంచి కంపెనీ షేర్లు లాభాల బాటలోనే పయనిస్తున్నాయి. 18, సెప్టెంబర్, 2017న స్టాక్ రికార్డ్ గరిష్టం రూ.137కి చేరుకుంది. బిగ్బుల్, ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం నాటికి కరూర్ వైశ్యా బ్యాంక్లో 4.50 శాతం వాటాను కలిగి ఉన్నారు. మరో ఏస్ ఇన్వెస్టర్స్ ఆశిష్ ధావన్(1.3 శాతం), ముకుల్ మహవీర్ అగర్వాల్(1.25 శాతం) ఇద్దరూ 1 శాతం కంటే ఎక్కువ వాటాను బ్యాంకులో కలిగి ఉన్నారు.