మీ అమ్మాయి స్కూల్‌కు రావట్లేదంటూ టీచర్ల ఫిర్యాదు.. తల్లిదండ్రులు నిలదీస్తే ఆ బాలిక చెప్పింది విని..

ABN , First Publish Date - 2022-03-02T22:25:29+05:30 IST

తమిళనాడులో ఓ బాలికకు యువకుడు ఏవేవో మాయమాటలు చెప్పి నమ్మించాడు. రోజూ ఆమెనే ఫాలో అవుతూ ఉండేవాడు. ఇలా ఆమెకు బాగా దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ఓ రోజు ..

మీ అమ్మాయి స్కూల్‌కు రావట్లేదంటూ టీచర్ల ఫిర్యాదు.. తల్లిదండ్రులు నిలదీస్తే ఆ బాలిక చెప్పింది విని..

బాలికలు, యువతులను ఎలాగైనా బుట్టలో వేసుకోవాలనే ఉద్దేశంతో కొందరు మోసగాళ్లు.. వివిధ రకాలుగా మాయమాటలు చెప్పి మోసగిస్తుంటారు. చాలా మంది యువతులు వారి మాటలు నమ్మి, చివరకు జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. కొందరు మాత్రం ఇలాంటి మోసగాళ్ల గురించి ముందే తెలుసుకుని జాగ్రత్తపడుతుంటారు. తమిళనాడులో ఓ బాలికకు యువకుడు ఏవేవో మాయమాటలు చెప్పి నమ్మించాడు. రోజూ ఆమెనే ఫాలో అవుతూ ఉండేవాడు. ఇలా ఆమెకు బాగా దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ఓ రోజు పాఠశాల టీచర్లు బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి ‘‘ మీ అమ్మాయి స్కూల్‌కు సరిగ్గా రావట్లేదు’’.. అని చెప్పారు. దీంతో వారు బాలికను ‘‘ స్కూల్‌కి వెళ్లకుండా రోజూ ఏం చేస్తున్నావ్’’.. అంటూ గట్టిగా నిలదీశారు. చివరకు బాలిక చెప్పింది విని అంతా షాక్ అయ్యారు..


తమిళనాడు చెన్నైలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో ఓ బాలిక 8వ తరగతి చదువుతోంది. తన అమ్మమ్మ ఇంట్లో ఉంటూ రోజూ పాఠశాలకు వెళ్తూ ఉంటుంది. ఈమె తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం వేరే ప్రాంతంలో ఉంటున్నారు. బాలిక పాఠశాలకు వెళ్లే క్రమంలో వసంత్ గిరీష్ అనే దంత వైద్య విద్యార్థి గమనిస్తూ ఉండేవాడు. ఎలాగైనా బాలికతో పరిచయం పెంచుకోవాలనే ఉద్దేశంతో అదే పనిగా కలుగజేసుకుని మరీ ఏవేవో మాయమాటలు చెబుతూ ఉండేవాడు. ఇతని మాటలను నమ్మిన బాలిక అతడికి బాగా దగ్గరైంది. ఏదో ఒక వంక పెట్టుకుని బాలికతో ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేవాడు. ఓ రోజు రాత్రి బాలికకు ఫోన్ చేసి.. ‘‘ నీకు ఓ విషయం చెప్పాలి.. మీ అమ్మమ్మ నిద్రపోగానే మా ఇంటికి వచ్చెయ్’’.. అని అన్నాడు. నిజమని నమ్మిన బాలిక.. తన అమ్మమ్మ నిద్రపోగానే ఎవరికీ తెలీకుండా యువకుడి ఇంటికి వెళ్లింది. గంజాయి తాగే అలవాటు ఉన్న గిరీష్.. బాలిక రాగానే బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో బాలిక అతడి మాటలను నమ్మింది. ఇలా రోజూ ఇంటికి పిలిపించుకుని దారుణానికి ఒడిగట్టడం, పొద్దునే బాలికను వారి ఇంటి వద్ద వదలడం చేస్తుండేవాడు.

నాలుగేళ్లుగా హోటల్లో ఒకే గదిని బుక్ చేసుకున్న యువకుడు.. లోపలికి వెళ్లిన సిబ్బందికి ఊహించని షాక్.. చివరకు ఏమైందంటే..


ఓ రోజు తన స్నేహితులను కూడా ఇంటికి రప్పించాడు. బాలికపై అంతా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో బాలిక పాఠశాలకు సక్రమంగా వెళ్లకపోవడంతో ఉపాధ్యాయులు ఆమె తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేశారు. ఓ రోజు తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో విషయం మొత్తం చెప్పేసింది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో వసంత్ గిరీష్‌తో పాటూ రెజిత్ అనే వర్ధమాన నటుడు, కళాశాల లెక్చరర్‌గా పని చేస్తున్న ప్రసన్న, విద్యార్థి విశాల్ ఉన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసు స్టేషన్​ ఎదుట స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

నాన్నా నేను ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నా... అంటూ ఆ తండ్రికి చెప్పిన 20 ఏళ్ల కూతురు.. చివరకు..

Updated Date - 2022-03-02T22:25:29+05:30 IST