ఫోన్‌లో మాట్లాడుతూ స్కూటీపై రైలుకే ఎదురెళ్లింది.. చివరికి ఈ యువతి చేసిన పనికి అంతా షాక్..

ABN , First Publish Date - 2022-02-06T23:51:38+05:30 IST

చిన్న చిన్న సమస్యల కారణంగా ఓ యువతి ఇంటి నుంచి బయటికి వెళ్లింది. స్కూటీలో వెళ్తూ, ఫోన్‌లో ఇంట్లో వారితో మాట్లాడుతూ.. ఏకంగా రైలుకే ఎదురెళ్లింది. చివరకు ఆమె చేసిన పనికి అంతా షాక్ అయ్యారు..

ఫోన్‌లో మాట్లాడుతూ స్కూటీపై రైలుకే ఎదురెళ్లింది.. చివరికి ఈ యువతి చేసిన పనికి అంతా షాక్..

క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు.. కొన్నిసార్లు జీవితాలనే సర్వనాశనం చేస్తుంటాయి. కాసేపు మౌనం పాటిస్తే సర్దుకుపోయే సమస్యలను కొందరు తెగేదాకా లాగుతుంటారు. చివరికి గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటారు. చిన్న చిన్న సమస్యల కారణంగా ఓ యువతి ఇంటి నుంచి బయటికి వెళ్లింది. స్కూటీలో వెళ్తూ, ఫోన్‌లో ఇంట్లో వారితో మాట్లాడుతూ.. ఏకంగా రైలుకే ఎదురెళ్లింది. చివరకు ఆమె చేసిన పనికి అంతా షాక్ అయ్యారు.


చెన్నై తిరువళ్లూరు పరిధి పుట్లూరుకు చెందిన దివ్య(30).. స్థానికంగా బ్యూటీపార్లర్ నిర్వహిస్తోంది. ఈమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో మనస్పర్థలు తలెత్తడంతో రెండు వారాలుగా దూరంగా ఉంటోంది. తర్వాత ఏం జరిగిందో ఏమో తెలీదుగానీ కుటుంబ సభ్యులతో కూడా అంటీముట్టనట్లుగా ఉండేది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి బ్యూటీపార్లర్‌ను మూసేసి ఇంటికి బయలుదేరింది. మధ్యలో రైల్వే ట్రాక్ వద్ద స్కూటీ ఆపి, కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడింది. 20నిముషాల పాటు ఫోన్‌లో మాట్లాడుతూనే స్కూటీలో రైలుకు ఎదురెళ్లింది. నిముషాల వ్యవధిలో ఎదరుగా వస్తున్న రైలును ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బాయ్స్ హాస్టల్లోకి ప్రియురాలిని తీసుకెళ్లాలి... అందుకోసం అతడు వేసిన మాస్టర్ ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది..

Updated Date - 2022-02-06T23:51:38+05:30 IST