పెళ్లయిన మూడు నెలలకే నవవధువు అదృశ్యం.. ఫోన్ చేస్తే స్విచాఫ్.. అసలు నిజం తెలిసి ఆ భర్తకు..

ABN , First Publish Date - 2021-12-22T21:56:35+05:30 IST

భార్య అదృశ్యం అన్న వార్త విన్న భర్తకు గుండె ఆగినంత పనైంది. కంగారుగా ఇంటికి వచ్చి చూస్తే, భార్య కనిపించలేదు. ఫోన్ చేస్తే స్విచ్ఛాప్ అని వచ్చింది. వెళ్తూ వెళ్తూ ఆమె చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

పెళ్లయిన మూడు నెలలకే నవవధువు అదృశ్యం.. ఫోన్ చేస్తే స్విచాఫ్.. అసలు నిజం తెలిసి ఆ భర్తకు..

కొత్తగా పెళ్లయిన ఆ జంట.. కలకాలం కాపురం చేస్తారని అంతా అనుకున్నారు. మెట్టినింటికి వచ్చాక అందరితో కలివిడిగా ఉంటే.. అత్తమామలు కూడా అలాగే అనుకున్నారు. కానీ ముచ్చటగా మూడు నెలలు కూడా కాపురం చేయకుండానే.. అలా చేస్తుందని ఎవరూ ఊహించలేదు. భార్య అదృశ్యం అన్న వార్త విన్న భర్తకు గుండె ఆగినంత పనైంది. కంగారుగా ఇంటికి వచ్చి చూస్తే, భార్య కనిపించలేదు. ఫోన్ చేస్తే స్విచ్ఛాప్ అని వచ్చింది. వెళ్తూ వెళ్తూ ఆమె చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..


తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలోని కనువాయికి చెందిన విఘ్నేష్ అనే వ్యక్తికి, నరసింహనాయకన్ క్యాంప్‌కు చెందిన యామినితో గత సెప్టెంబర్‌లో వివాహమైంది. భార్య అందంగా ఉండడంతో ఎలాంటి అనుమానాలూ పెట్టుకోకుండా పెళ్లి ఖాయం చేసుకున్నారు. అందంతో పాటూ అనకువ ఉన్న భార్య దొరికిందని.. విఘ్నేష్ కూడా సంతోషంగా ఉండేవాడు. అత్తింట్లో అడుగుపెట్టిన యామిని.. వారి ఆలోచనలకు తగ్గట్టుగానే ఉండడంతో అంతా సంతోషంగా ఉండేవారు. అయితే ఈ సంతోషం వారికి కొన్ని నెలలే అని తెలుసుకోలేకపోయారు.

బస్సు టికెట్‌పై ఫోన్ నెంబర్ రాసి ఇచ్చిన కండక్టర్.. ఆ ప్రయాణికురాలు ఇచ్చిన ట్విస్ట్‌ మామూలుగా లేదుగా..!


ఈ నెలలో ఓ రోజు భర్త, అత్తమామలు పని మీద బయటికి వెళ్లారు. ఇంటికి వచ్చిన అత్తమామలకు యామిని కనిపించలేదు. పక్కన ఉన్న ఇళ్లలో విచారించినా ఫలితం లేకపోవడంతో విఘ్నేష్‌కు సమాచారం అందించారు. ఈ వార్త వినగానే కంగారుగా ఇంటికి వచ్చాడు. భార్యకు ఫోన్ చేస్తే స్విచ్ఛాప్ అని వచ్చింది. తర్వాత ఇంట్లో పరిశీలించగా.. భార్య దుస్తులు, నగలు, నగదు కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చి దుడియలూర్ పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసుల విచారణలో ఆమెకు గతంలోనే ఓసారి పెళ్లయిందని తెలిసింది.

తలనొప్పి వస్తోంది.. మాత్రలు తీసుకురమ్మని భర్తను పంపించి.. అత్తారింట్లో మొదటిరోజే ఈ కొత్త పెళ్లికూతురి నిర్వాకానికి..


శివకుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న యామిని, కొన్నాళ్లు సంసారం చేసిన అనంతరం అతన్ని వదిలేసి మళ్లీ విఘ్నేష్‌ను చేసుకున్నట్లు తేలింది. ఇక్కడ నుంచి వెళ్లిపోయిన యామిని.. మళ్లీ మొదటి భర్తతో ఉంటోందని తెలుసుకుని అంతా అవాక్కయ్యారు. దీనికితోడు యామినికి ఆమె తల్లిదండ్రులు కూడా సహకరించినట్లు తెలిసింది. తన భార్యకు ముందే పెళ్లయిన విషయం దాచిపెట్టి మోసం చేశారని విఘ్నేష్ ఫిర్యాదు చేశాడు. యామినితో పాటూ ఆమె తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేయాలని వేడుకున్నాడు.

పొద్దున్నే 5గంటలకు భార్య బయటకు వెళ్లడం చూసిన భర్తకు డౌట్.. వెనుకే వెళ్తే బస్టాండ్‌లో ఆమె నిర్వాకం చూసి..

Updated Date - 2021-12-22T21:56:35+05:30 IST