ఇది దుర్మార్గపు ప్రభుత్వం
ABN , First Publish Date - 2021-01-27T06:00:35+05:30 IST
వైసీపీ ప్రభుత్వం దుర్మార్గపు ప్రభుత్వమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున విమర్శించారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున
నెల్లిమర్ల: వైసీపీ ప్రభుత్వం దుర్మార్గపు ప్రభుత్వమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున విమర్శించారు. గొర్లెపేటలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రామతీర్థంలో ఈనెల 2న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు, వాటర్ ప్యాకెట్లు విసరగా, ఈ సంఘటనకు ఎలాంటి సంబంధంలేని తమ పార్టీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు రామతీర్థం వచ్చినంత వరకు అధికారంలో ఉన్న మంత్రులు ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు, పార్టీ నాయకులు పతివాడ తమ్మినాయుడు, బయిరెడ్డి నాగేశ్వరరావు, లీలావతి, బొంతు వెంకటరమణ, తాడ్డి సత్యనారాయణ, గేదెల అనిల్కుమార్ పాల్గొన్నారు. రామతీర్థం ఘటనలో అరెస్టయిన వారి కుటుంబాలను నాగార్జున, పతివాడలు పరామర్శించారు. గొర్లెపేట, సీతారామునిపేట గ్రామాల్లోగల బాధితుల ఇళ్లకు వెళ్లి, వారికి భరోసా ఇచ్చారు.