ఈ తెలివిని మెచ్చుకోలేం.. ఆనంద్ మహీంద్రా ట్వీట్!

ABN , First Publish Date - 2021-02-27T09:53:39+05:30 IST

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన దృష్టిని ఆకర్షించిన విషయాలపై కామెంట్లు చేయడం ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రాకు అలవాటే. ఈ క్రమంలో ఆయన తాజాగా ఓ ఫొటో షేర్ చేశారు.

ఈ తెలివిని మెచ్చుకోలేం.. ఆనంద్ మహీంద్రా ట్వీట్!

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన దృష్టిని ఆకర్షించిన విషయాలపై కామెంట్లు చేయడం ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రాకు అలవాటే. ఈ క్రమంలో ఆయన తాజాగా ఓ ఫొటో షేర్ చేశారు. అయితే ఆ ఫొటోలోని వ్యక్తి చేసిన పని ఆయన్ను మెప్పించలేదు. ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? కరోనా కారణంగా మాస్కు వేసుకోకుండా బయటకు రావొద్దని ఒక పక్క ప్రభుత్వం మొత్తుకుంటున్న విషయం తెలిసిందే కదా.


మనోడు ఆ రూల్ పాటించాడు. కాకపోతే మాస్కుతో ముక్కు, నోరు కప్పుకోకుండా కళ్లు కప్పుకొని ఎంచక్కా కునుకుతీశాడు. మళ్లీ కరోనా కోరలు చాస్తున్న ముంబై మహానగరంలో అదీ ఓ రైలు ప్రయాణంలో అతను ఈ పని చేశాడు. ఈ ఫొటోను షేర్ చేసిన మహీంద్రా.. ‘‘ఇటీవల ముంబైలో పెరుగుతున్న కరోనా కేసుల కారణాలు వెతికితే..’’ అంటూ పోస్టు పెట్టారు. అలాగే ఈ తెలివికి ఎలాంటి పొగడ్తలూ పొందే అర్హత లేదని విమర్శించారు.

Updated Date - 2021-02-27T09:53:39+05:30 IST