ముక్కంటి సేవలో తిరువావదుతురై ఆదీనం పీఠాధిపతి

ABN , First Publish Date - 2021-10-19T06:01:46+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరుడిని తిరువావదుతురై ఆదీనం పీఠాధిపతి అంబల వనదేశిక పరమాచార్య దర్శించుకున్నారు.

ముక్కంటి సేవలో తిరువావదుతురై ఆదీనం పీఠాధిపతి
ముక్కంటి ఆలయంలో అంబల వనదేశిక పరమాచార్య

శ్రీకాళహస్తి, అక్టోబరు 18: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడిని సోమవారం తిరువావదుతురై ఆదీనం పీఠాధిపతి అంబల వనదేశిక పరమాచార్య దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ ఈవో పెద్దిరాజు స్వాగతం పలికి స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. గురుదక్షిణామూర్తి సన్నిధి చేరుకున్న పీఠాధిపతికి వేద పండితులు ముక్కంటి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-19T06:01:46+05:30 IST