శ్రీరామ వైభవం..

ABN , First Publish Date - 2021-04-23T10:27:42+05:30 IST

తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం వైభవంగా జరిగింది. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామి

శ్రీరామ వైభవం..

తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం వైభవంగా జరిగింది. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ జరిగింది. ఆ తర్వాత వెభవోత్సవ మండపంలో సహస్ర దీపాలంకరణ సేవను నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను మాడవీధుల్లో ఊరేగించారు. రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి శ్రీరామపట్టాభిషేకాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు.


తిరుమల 

Updated Date - 2021-04-23T10:27:42+05:30 IST